
20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం
న్యూస్ వెలుగు సచివాలయం : సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!