దేవరగట్టులో శ్రీ మాళ మల్లేశ్వరుని బండారు మహిమ

దేవరగట్టులో శ్రీ మాళ మల్లేశ్వరుని బండారు మహిమ

51 జటికీలకు గొలుసు తెంపిన గొరవయ్య గాదిలింగప్ప
తరలి వచ్చిన అశేష భక్త జనం.
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో విజయదశమి ఉత్సవాలో భాగంగా కర్రల సమరం అనంతరం ప్రాధాన్యత సంతరించుకున్న గొరవయ్యల గొలుసు తెంపే కార్యక్రమం అత్యంత ఉత్కంఠంగా సాగింది.ఉత్సవలో 3వ రోజు అయిన మంగళవారం గొరవయ్యల గొలుసు తెంపే కార్యక్రమాని తిలకించేందుకు తరలి వచ్చిన భక్తులతో దేవరగట్టు కిటకిటలాడింది.సింహసన కట్ట వద్ద కొలువుదీరిన స్వామివారి విరట్ మూర్తులు ఉన్న మల్లప్ప తాత గుడి ఎదురుగా ఇనుప గొలుసును తెంపటం ఆనవాయితీగా వస్తోంది.ప్రతి ఏటలా ఈ సారి కూడా బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగప్ప 51 జటికీలకు గొలుసు తెంపడంతో శ్రీ మాళ మల్లేశ్వరస్వామి ఢమరుగా నాధం,బండారు మహిమ ఎంతో మహిమాన్వితమైనదని భక్తులు పేర్కొన్నారు.దీంతో భక్తులు అయన భుజం పై ఎత్తుకొని డిర్ర్..ర్ర్…గోపరక్ అంటూ కేకలు వేశారు.ఈ గొలుసు తెంపే కార్యక్రమాని తిలకించేందుకు మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక,తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ముందుగా మల్లప్ప గుడి వద్ద ఉన్న విరాట్ మూర్తుల ఎద్దుట గొరవయ్య తమ సంప్రదాయ నృత్యన్నీ ప్రదర్శించారు.త్రిశూలం, పిలనిగ్రోవి చేత పట్టి, ఢమరుకంతో ఆడిస్తూ చేసిన గొరవయ్యల నృథోత్సవం అందరిని ఆకట్టుకుంది.అలాగే గురు గొరవయ్యలు చాటలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెప్తూ పునకంలో ఊగిపోయారు.ఈ కార్యక్రమంలో పిల్ల గొరవయ్యలు సైతం పాల్గొని దైవ వచనాలు వెలివేస్తూ దానికి తగ్గట్టుగా నృత్య ప్రదర్శన చేశారు.
ఆలూరు,ఆదోని,గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన దేవదాసిలతో సాయంత్రం వేళ దేవదాసి క్రీడోత్సవం ఘనంగా జరిగింది.అనంతరం రంగుల నీళ్లను భక్తుల పై చల్లి వసంతోత్సవం,కంకణ విసర్జన కార్యక్రమం నిర్వహించారు.అలాగే ఉత్సవ విగ్రహాలను,పల్లకిని ఊరేగింపుగా కొండ పై ఉన్న ఆలయానికి తీసుకెళ్లారు.అదేవిధంగా ఉత్సవాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఆదేశాల మేరకు ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,ఎస్ఐ బాల నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!