ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై రెండు రోజుల అవగాహన సదస్సు

ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై రెండు రోజుల అవగాహన సదస్సు

న్యూస్  వెలుగు గుంటూరు : గుంటూరు నగరంలోని స్థానిక జెకెసి కళాశాలలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై రెండు రోజుల అవగాహన సదస్సు ను నిర్వహించినట్లు సదస్సు సంచాలకులు, కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి ఆచార్య యలవర్తి సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సదస్సు ముఖ్యంగా విభిన్న పాఠ్య ప్రణాళికలతో కూడిన విద్యా బోధనకు, నేటి వర్తమాన పరిశోధనాత్మక పరిస్థితులకు మధ్యగల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పాటించవలసిన సలహాలను జాగ్రత్తలను సూచనలను నిష్ణాతులైన వారితో అందించేలా ఈ సదస్సు దోహద పడిందని ఆయన వివరించారు. ఈ సదస్సును కళాశాల సహాయ ప్రిన్సిపల్ కే సాంబశివరావు ప్రారంభోపన్యాసం చేసి ప్రారంభించగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పరుచూరి గోపీచంద్ అభినందనలతో ముగిసింది. ఈ సదస్సులో కీలకోపన్యాసకులుగా హైదరాబాదుకు చెందిన శిక్షకులైన వికాస్ విద్యార్థినీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి రంగాలలో నేటి సమాజ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులు తమలోని నైపుణ్యాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో సోదాహరణంగా విశదీకరించారు. సదస్సుకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులు ఇలాంటి సదస్సులు తమకెంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగ ఉపాధి రంగాలలో రాణించడానికి కావలసిన మెళకువలను అందించేలా భవిష్యత్తులో ఇలాంటి సదస్సులను నిర్వహించితే తమకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు ఆకాంక్షించారు.ఈ సదస్సులో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ కోర్సు విభాగాధిపతి వై వెంకటేశ్వరరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.విద్యార్థినీ విద్యార్థులు ఈ సదస్సును విజయవంతం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!