వక్ఫ్ బోర్డ్ బిల్లును తక్షణమే నిలిపివేయాలి

వక్ఫ్ బోర్డ్ బిల్లును తక్షణమే నిలిపివేయాలి

తుగ్గలి న్యూస్ వెలుగు;  కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును తక్షణమే నిలిపివేయాలని రాంపురం కొట్టాల ముస్లింలు తెలియజేశారు. సోమవారం రోజున రంజాన్ పర్వదినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును తక్షణమే నిలిపివేయాలని వారు నిరసనను వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముస్లింల గురించి పునరాలోచన చేసి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని ముస్లిం సోదరులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గ్రామ సర్పంచ్ కమల్ భాష,గ్రామ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!