
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం; ఎస్పీ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 78 ఫిర్యాదులు
కర్నూలు, న్యూస్ వెలుగు; వృద్దుల వద్దకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ. కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 78 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) కర్నూలు కు చెందిన హసీనా బేగం, మహబూబ్ భాషా కలిసి కర్నూలులోని , మద్దూర్ నగర్ లో జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 1 లక్ష 80 వేలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , ఎల్బీఎస్ నగర్ కు చెందిన వీర అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
2) 30 గొర్రెలు దొంగతనం చేసిన బాలు, నాగరాజు, దుబ్బ రామకృష్ణల పై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని సి.బెలగల్ మండలం, పోలుకల్లు గ్రామానికి చెందిన పలుదొడ్డి జమ్మన్న ఫిర్యాదు చేశారు.
3) కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు, సోమిశెట్టి నగర్ కు చెందిన రామయ్య ఫిర్యాదు చేశారు.
4) మా కుమార్తె చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు ఆస్తి ఇవ్వకుండా నా అల్లుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొత్తపల్లి మండలం, నందికుంటగ్రామం కు చెందిన జి. వెంకటలక్షమమ్మ ఫిర్యాదు చేశారు.
5) నాకు తెలియకుండానే నా పేరు మీద రూ. 1 లక్ష గొర్రెల లోన్ తీసుకొని బ్యాంకులో పని చేసే చంద్ర, చాంథ్ భాషా లు కలిసి మోసం చేశారని దేవనకొండ మండలం, బండగట్టు గ్రామానికి చెందిన అరుణమ్మ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వజైర్ మల్లికార్జున రావు, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.