
యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి : ఎంపీటీసీ మునెప్ప
పత్తికొండ న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సీనియర్ జర్నలిస్ట్ అంజి ,అంబేద్కర్ కమిటీ సభ్యులు పల్లె పెద్దయ్య , సర్పంచ్ సుధాకర్ రెడ్డి , ఎంపిటిసి మునెప్ప ముఖ్య అతిధులు హాజరై అంబేద్కర్ విగ్రహానికిని పూలమాల వేసి నివాళులు అర్పించినట్లు వెల్లడించారు.
సర్పంచ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ, బడుగు , బలహీల వర్గాల ఆశాకిరణం ఆయనేనన్నారు. ఆయన ఆశయ సిద్ధాంతాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సుధాకర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. విద్యనే బలమైన ఆయుధమని అంబేద్కర్ చదువుకోవడం వల్లే విదేశాల్లో చదువగలిగారని ముక్కెళ్ల ఎంపిటిసి మునెప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో మధుశేఖర్ , మహేష్ , రంగస్వామి ,గళ్ళ పెద్దయ్య , రామకొండ రమేష్ , మంకె రాముడు , బత్తిన రమేష్, అగ్రహారం ఆంజనేయులు గ్రామా పెద్దలు యువత పాల్గొన్నారు.