
ఘనంగా ఫుర్ఖాన్-24 వార్షిక ఖత్ముల్ ఖురాన్ మజ్లిస్ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు :మండల కేంద్రంలో ఆదివారం అహెక్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్
నూరాని జామియా మస్జిద్ హోళగుంద సంయుక్త ఆశ్రయంలో ఫుర్ఖాన్-24 వార్షిక ఖత్ముల్ ఖురాన్ మజ్లిస్ కార్యక్రమం రివా ఇంగ్లీషు మీడియం పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు.మదర్స సహాయకుల పేరిట 25 ఖురాన్ ఖానీ,1 లక్ష తహ్లీల్, సూరా యాసీన్లు చదివి దువా చేశారు.ఈ కార్యక్రమంలో అహెక్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మౌలానా షంషుద్దీన్ సఖాఫీ,మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ నాయకులు సాయిబేష్,హుస్సేన్ పీర్, దాదవలి,సబ్జాన్,బడేసాబ్, రహమాన్,మదర్స ఉపాధ్యాయులు,హత్తిబెళగల్, గుళ్యం మద్రాసా విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!