అంగరంగా వైభవంగా రథోత్సవ వేడుకలు

అంగరంగా వైభవంగా రథోత్సవ వేడుకలు

అంగరంగా వైభవంగా రథోత్సవ వేడుకలు

* పెద్దఎత్తున హాజరై మొక్కులను తీర్చుకున్న భక్తులు.

* భక్తులకొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:

మండల పరిధిలోని గల ఉప్పర్ల గ్రామ సమీపంలోని గల బోడబండ పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ పకీరప్ప గురు స్వాములు,శ్రీ యల్లప్ప గురుస్వాములు మరియు శ్రీ ఆంజనేయులు తాత వారి రథోత్సవ వేడుకలు అశేష జనవాహిని మధ్య గురువారం రోజున ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉదయం శ్రీ పక్కీరప్ప స్వామి,శ్రీ యల్లప్ప స్వామి,శ్రీ ఆంజనేయులు తాత ఉత్సవమూర్తులు అప్పా నారాయణ స్వామి ఆధ్వర్యమున గంగాస్నానం నిర్వహించారు.అనంతరం పెరవలి గ్రామము గవ్వల గురునాథము, మొలగవెల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ రంగన్న తాత,శ్రీ పక్కీరప్ప తాత భక్తాదులు మరియు హైదరాబాద్ శ్రీరాములు గార్లు చేత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సంధ్యావేళలో నిర్వహించిన శ్రీ పకీరప్ప గురు స్వాములు,శ్రీ యల్లప్ప గురుస్వాములు మరియు శ్రీ ఆంజనేయులు తాత వారి రథోత్సవ వేడుకలకు భక్తులు,ప్రజలు
పెద్దఎత్తున హాజరై మొక్కులను తీర్చుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్త అప్పా వేణు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ అర్బన్ సీఐ జయన్న పత్తికొండ,జొన్నగిరి పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి భీమన్న,అప్పా చంద్రశేఖర్,అప్పా నారాయణ స్వామి, నీలా ప్రసాద్,నీలా మనోహర్, సుంకప్ప,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!