
అంబేద్కర్పై వ్యాఖ్యలు దుమారం వేళ.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై తీవ్ర ఆరోపణలు చేశారన్న ఇండియా కూటమి నేతల ఆందోళలనపై చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గురువారం ఏపీ కేబినెట్ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్కు తగిన గౌరవం లభించలేదని, అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని పేర్కొన్నారు.
వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు జరిగిందని, స్వాతంత్య్రం వచ్చి నాటిన నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చ జరుగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కూటమి నేతలు సున్నిత అంశాలపై జాగ్రత్తగా ఉండాలని, మంచి ఉద్దేశంతో మాట్లాడినా.. చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని తెలిపారు. గతంలో వ్యవసాయం దండగ అని అనకున్నా .. అన్నట్టు ప్రచారం చేశారని మంత్రులకు గుర్తు చేశారు.
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిసున్నానని, మంత్రులుగా, ప్రభుత్వ పరంగా ప్రజల నుంచి సమాచారం తెప్పిస్తున్నానని వెల్లడించారు. ఆరు నెలల పనితీరుపై ముగ్గురు మాత్రమే మంత్రులు రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని తెలిపారు.
మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని, సోషల్ మీడియాను మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు.