
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు కమీషనర్ ఎస్.సత్యనారాయణ దర్శించుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించినట్లు ఆలయ ఈవో కె ఎస్ రామరావు వెల్లడించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వారికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందచేసినట్లు పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu