
అయన చరిత్రను విద్యార్థులకు పాఠంగ చెప్పండి
న్యూస్ వెలుగు నంద్యాల : పాణ్యం నియోజకవర్గము పూడిచర్ల గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించామని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు బిర్రు ప్రతాపరెడ్డి, తూముకుంట ప్రతాప్ రెడ్డిలు తెలుపుతూ ,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పదిలం కావాలని, అమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలి. భారత స్వాతంత్ర్య పోరాటంలో తొలి వీరులలో ఒకరైన నరసింహారెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్కు ఆయన పేరు పెట్టాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
“ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ పాలకుల దమనకాండను ఎదుర్కొని తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహానీయుడు. అలాంటి వ్యక్తిత్వాన్ని మన భవిష్యత్ తరాలకు చేరువ చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.ఈ వినతిపత్రం సమర్పణలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి లు, రెడ్డి సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక నాయకులు, చరిత్ర ప్రేమికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభు చాలాత్వం ఈ అభ్యర్థనను స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటుందని సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.