
బాలిక హత్యకేసు విచారణ జరుగుతోంది :డీఎస్పీ
కర్నూలు న్యూస్ వెలుగు:కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి సోమన్నను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు గుడిసె శివన్నతెలిపారు. లక్ష్మారి మెడల్ స్కూలు హత్య కావించబడిన కురువ పార్వతి కేసు విషయమై గుడిసె శివన్న డిఎస్పి దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్పీ మాట్లాడుతూ అందుకు సంబందించిన రిపోర్టులు రావాల్సిందని , త్వరలోనే విచారణ పూర్తి చేసి వెల్లడిస్తామన్నారు. విచారణలో ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని బాధిత కుటుంబాలకు న్యాయ బద్దంగా విచారణ జరుగుతుందని వారికి డీస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌతాళం ఎంపీపీ అమ్రేష్, కురవ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివరాం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist