
ఆర్డిటి సేవలకు ప్రభుత్వం అండగా ఉంది మంత్రి నారా లోకేష్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు) : “RDT (rural development trust) అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు. లక్షలాది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం. ఆర్డీటీ వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయి. వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకే సంప్రదించాం. ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం. తెలుగు ప్రజలతో ఆత్మీయ, మానవతా సేవా బంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.

Was this helpful?
Thanks for your feedback!