ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం : పవన్ కళ్యాణ్

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం : పవన్ కళ్యాణ్

న్యూస్ వెలుగు : రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి  నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ. 10,000 నుంచి రూ.20,000 పెంచినట్లు తెలిపారు . మత్స్యకారుల సేవ పథకం ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు వారు వెల్లడించారు . రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందన్నారు. చేపల వేటపై ఆధారపడ్డ కష్ట జీవులకి ఈ రెండు నెలలు జీవనానికి ఎలాంటి సమస్య రాకుండా చేసే దిశగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన దశలోనే చర్చించడం జరిగిందన్నారు . ఎన్నికల హామీ కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . జీవన భృతి ఇచ్చి ఆదుకోవడం మాత్రమే కాదు వలస వెళ్తున్న మత్స్యకారులకు ఇక్కడే తగిన ఉపాధి చూపించే ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో, తీర ప్రాంత అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS