ఇష్టలింగ పూజకు అశేష భక్త జనం

ఇష్టలింగ పూజకు అశేష భక్త జనం

న్యూస్ వెలుగు హొళగుంద : వైభవంగా శ్రీ కాశీ జగద్గురువుల ఇష్టలింగ పూజ కార్యక్రమం.
*పూజా కార్యక్రమంలో పాల్గొన్న అశేష భక్త జనం.
*భక్తి పరవశమైన భక్తులు.
*భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు.
హోళగుంద, న్యూస్ వెలుగును :మండల కేంద్రంలో శ్రీ కలబురగి శరణు బసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ 1008 డాక్టర్ మల్లికార్జున విశ్వరాధ్య పండితారాధ్య శివాచార్య భగవత్పాదులు కాశీ పీఠం వారణాసి వారి ఇష్టలింగ పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది.ప్రధానంగా ఉదయం 8 గంటల నుండి దాదాపు 12 గంటల వరకు సోలాపూర్ సంగీత కళాకారుల భక్తి గీతాలకు అనుగుణంగా జగద్గురువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇష్టలింగ పూజా కార్యక్రమాని చేపట్టారు.దీంతో భక్తులు పూజా కార్యక్రమాని వీక్షించి భక్తి పరవశమయ్యారు.ఈ సందర్భంగా జగద్గురువులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని మరియు లింగపూజను అలవర్చుకోవాలని సూచించారు.అలాగే ప్రస్తుత సమాజంలో తల్లితండ్రులు యువతకు బంధాలు,బంధుత్వాలు,దైవ కార్యక్రమాలో పాల్గొనేలా మార్గదర్శలు అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి చుట్టూ పక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,శివ శంకర్ గౌడ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!