ఎకనమిక్ హబ్‌గా ఏపీ రాజధాని..

ఎకనమిక్ హబ్‌గా ఏపీ రాజధాని..

           అమరావతి అభివృద్ధికి 800 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం..!

అమరావతి;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర అభివృద్ధికి రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. అలాగే అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసినట్లు గురువారం ప్రపంచ బ్యాంకు వర్గాలు తెలిపాయి. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ‘అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్’ కింద 800 మిలియ అమరావతి న్ డాలర్ల రుణం మంజూరు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పర్యావరణ హిత అభివృద్ధి కేంద్రంగా అమరావతిని రూపుదిద్దుతారు. ప్రస్తుత, భవిష్యత్ పౌరుల స్థితిగతులు మెరుగు పర్చడంతోపాటు ఉపాధి కల్పనకు ఈ రుణం వినియోగిస్తారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎకనమిక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రుణం మంజూరు చేయాలని భారత ప్రభుత్వం కోరిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అత్యంత అవసరమైన వారితోపాటు పౌరులందరి జీవన స్థితిగతులు మెరుగు పర్చి, ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా అమరావతిని మోడర్న్ సిటీగా రూపుదిద్దాలని భారత్ కోరిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 29 ఏండ్లలో ఈ రుణం చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఆరేండ్లు గ్రేస్ పీరియడ్ ఉంటుంది

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS