ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

కర్నూలు: కాంట్రాక్టు వ్యవస్థనే జగన్ ప్రభుత్వం చంపేసిందని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రతి నిమిషానికి ఆర్ధిక పరిస్థితులు బేరీజు వేసుకుని పాలన చేయాల్సి వస్తోందని అన్నారు. ఏడు శాతం అప్పులు చేసి జీతాలు చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ఆదాయం ఇచ్చేది కాంట్రాక్టర్లే అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని… త్వరలో మరికొన్ని చేస్తామని తెలిపారు. ఆర్సల్ మిట్టల్ కంపెనీ సీఎం చంద్రబాబును నమ్మి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలకే ఆర్ధిక శాఖ పేమెంట్‌లు చెల్లిస్తుందనే అపవాదు ఉందని చెప్పారు. ప్రియారిటీ ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోపిడీ దారులుగా చేసుకుందని విమర్శలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రాక్టర్లను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. దీపావళి పండుగకు కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!