
ఏపీలో 250 కోట్ల అవినీతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ అసెంబ్లీ న్యూస్ వెలుగు : ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రత్యేకంగా సోషల్ ఆడిట్ పై దృష్టిపెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో జరిగిన అనేక అవకతవకలు, నిధుల దుర్వినియోగం వెలుగులోకి తీసుకొచ్చాం. దాదాపు 546 మండలాల్లో ఇప్పటికే సోషల్ ఆడిట్ పూర్తికాగా, మిగతా మండలాల్లో మార్చి 31 నాటికి పూర్తికానుందని ఉప ముఖ్యమంత్రి సభకు తెలిపారు. దాదాపు ₹250 కోట్ల అవినీతి జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని వారు అన్నారు . దానిలో ₹71 కోట్లు రికవరీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేయడం జరిగింది – అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!