
కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): సచివాలయం 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం సోమవారం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ల సదస్సు సందర్భంగా సచివాలయంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లతో కలిసి సీఎం నారా చంద్రబాబునాయుడు వర్కింగ్ లంచ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో కూడా అందేలా మార్గదర్శకాలను ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.


Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM