
కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా ఆర్థిక సహాయం
హలహర్వి,న్యూస్ వెలుగు; హలహర్వి మండలం గుల్యం గ్రామం దూదేకుల కులానికి చెందిన కసింసాబ్,షేకమ్మ దంపతులు గత రెండు నెలల క్రితం స్వర్గస్తులయ్యారు వీరికి ముగ్గురు సంతానం ఆసియ బీ సఫీయ ఆఫ్రిన్ తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాధగా మారారు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పిల్లలు వారి ఆర్థిక స్థితిని విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సింధనూర్ దూదేకుల సంఘానికి చెందిన పలువురు పెద్ద మనసుతో అనాధలైన ముగ్గురు పిల్లలపై సుమారు 8 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఇందులో భాగంగా కర్నూల్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గం కౌతలం మండలం ఉప్పరహళ్ళు, బదినెహాలు గ్రామానికి చెందిన దూదేకుల సంఘానికి చెందిన పలువురు 1,21,000 చెక్కు రూపం లో ఆర్థిక సాయం కుటుంబనికి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల గౌరవ సలహాదారులు పి.సాయిబాబు పి. ఇమామ్ ఖాసీం, రాష్ట్ర ఉపాధ్యక్షులైన పి శిక్షావలి రిటైర్డ్ ఎమ్మార్వో, కర్నూలు జిల్లా దుదేకుల అధ్యక్షుడు మహబూబ్ బాషా, జిల్లా సెక్రెటరీ సిద్దయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మాబుసాబ్, మల్కన్నా ఖాదర్ బాషా,ఖాసీం షేకన్న తదితరులు పాల్గొన్నారు