
కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ
నంద్యాల న్యూస్ వెలుగు : జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్కిల్ నందు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి భారతరత్న ఆటల్ బిహారీ వాజ్ పాయ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం భూమి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మధు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు చర్లపల్లి నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి, శ్రీనివాసరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శిలు జిల్లా కార్యదర్శిలు మోర్చాల అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

