
కాశిబుగ్గ సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాలోకేష్
శ్రీకాకుళం (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించినట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు. దుర్ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నాను. బాధితులకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనికి బాద్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!

