
కుటుంబానికి పార్టీ అండగావుంటుంది నారాలోకేష్
అమరావతి : ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో నన్ను కలిశారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ చౌదరి మృతిచెందడం నన్ను కలచి వేసింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఏనుగుల దాడిచేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. రాకేష్ చౌదరి పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషిచేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM