
కుళ్లిపోయిన మిరప,పత్తి పంటలను పరిశీలించిన కూటమి పార్టీ నాయకులు వ్యవసాయ అధికారి
హోళగుంద, న్యూస్,వెలుగు: మండలంలో రైతులు పొలాల్లో విత్తిన పంటలు వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు.మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి.మరియు పంట పండించిన రైతుకు పెట్టుబడి కూడా రాకుండా దినావస్థలో ఉన్నారు.ఇంత ఉన్న మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేకపోతున్నారు.ప్రతి సంవత్సరం ఈ దృక్పథం మంచిది కాదు కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సోమవారం భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,కూటమి పార్టీ నాయకులు పంపాపతి, ఎర్రిస్వామి,అబ్దుల్ సుబాన్, మోహిన్,కృష్టయ్య తదితరులు అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ ఆనంద్ లోకదళ్,ఏఈఓ విరూపాక్షి, సచివాలయం సిబ్బందిభారతి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కుళ్లిపోయిన మిరప మరియు పత్తి పంటలను పరిశీలిస్తున్న నేషనల్ కౌన్సిల్ మేంబర్ చిదానంద, రైతులు అధికారులతో పాటు కుళ్లిపోయిన మిరపను పరిశిలించదం జరిగింది. హొలగుంద మండలంలో పంటలు విత్తిన తర్వాత అనావృష్టి వలన పంటలు నష్టపోయాయి. పంటలు వేసిన రైతులు నష్టపోయారు మొదట్లో అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వల్ల ప్రస్తుతం పంటలు దెబ్బతింటున్నాయి పండించిన రైతుకు పెట్టుబడి కూడా రాకుండా దినావస్థలో ఉన్నాడు మండలంలో LLC పోతున్నది తప్ప LLC ద్వారా 0.05% కూడా రైతులు సాగు చేయడం లేదని మరల LLC ను బూచి చూపించి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేకపోతున్నారు ప్రతి సంవత్సరం ఈ దృక్పథం మంచిది కాదు కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తుదన్నారు.