కృష్ణవేణి నదీ ప్రవాహం శాంతించాలని శాస్త్రోక్తముగా పూజలు

కృష్ణవేణి నదీ ప్రవాహం శాంతించాలని శాస్త్రోక్తముగా పూజలు

ఇంద్రకీలాద్రి,న్యూస్ వెలుగు ;శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కృష్ణ నది వరద ఉదృతి తగ్గాలని  సోమవారం  రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్ ఎస్ సత్యనారాయణ, , ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో సర్వ దేవతా స్వరూపమైన పవిత్ర కృష్ణా నదీమ తల్లికి సోమవారం  శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి, సౌభాగ్య సుగంధములైన చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు తదితర వస్తువులు సమర్పించి, కృష్ణవేణి నదీ ప్రవాహం శాంతించాలని పూజించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ లు కెవి ఎస్ కోటేశ్వరరావు, లింగం రమ, ఇంజినీరింగ్, అర్చక ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!