
గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేస్తాం
అమరావతి; పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి….ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. వరుణ దేవుడు కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు నీళ్లతో నిండాయి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
Was this helpful?
Thanks for your feedback!