ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లో 36 మంది ప్రయాణికులు

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లో 36 మంది ప్రయాణికులు

నంద్యాల న్యూస్ వెలుగు : అద్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు, లారీ దగ్ధం కాగా డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన

నంద్యాల జిల్లోని శిరివెళ్ల మిట్ట వద్ద చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఒక DCM డ్రైవర్ వెంటనే స్పందించారు. ఆయన బస్సు అద్దాలను పగులగొట్టి, లోపల ఉన్న సుమారు 36 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనివల్ల పెద్ద ప్రాణనష్టం తప్పింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమపాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే బస్సు, లారీ పూర్తిగా దగ్ధం అయినట్లు ప్రయాణికీలు తెలిపారు. అనంతరం పోలీసులు సంఘటన పై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!