జల క్రీడలకు హబ్ గా కర్నూలు

జల క్రీడలకు హబ్ గా కర్నూలు

కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్రంలో జిల్లా క్రీడలకు హబ్ గా కర్నూలు నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు లు అన్నారు. శనివారం గార్గేయపురం లోని కర్నూలు సిటీ ఫారెస్ట్ చెరువు నందు రాష్ట్ర స్థాయి 4 వ కెనోయింగ్,కయాకింగ్, డ్రాగన్ బోట్ పోటీలను రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు సెంటర్ ఇన్చార్జ్ కార్తికేయన్,జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్,రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారి డాక్టర్ రుద్ర రెడ్డి,కర్నూలు జిల్లా యోగ సంఘం ఉపాధ్యక్షులు సాయి కృష్ణతో కలిసి వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఈఓ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ నూతన క్రీడలను అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు,క్రీడా సంఘాల ప్రతినిధులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అన్నారు.కర్నూలు జిల్లాకు జల క్రీడలను పరిచయం చేస్తున్న నిర్వాహకుల కృషి అభినందనీయమన్నారు.

విద్యార్థులు చదువుతూ సమానంగా అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తు ఉద్యోగంగా ఉంటుందన్నారు.అనంతరం డీఎస్సీఓ భూపతిరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి చేయూతనందిస్తామన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తే ఫలితాలు సాధించవచ్చు అన్నారు. రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయకుమార్ లు మాట్లాడుతూ క్రీడాకారులు తాముంచుకున్న క్రీడల్లో సత్తా చాటేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే రాణిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనోయింగ్,కయాకింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శివారెడ్డి, ఆంధ్రా ప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ సెక్రెటరీ మంచికంటి అవినాష్, కర్నూలు జిల్లా వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్, జిల్లా స్కేటింగ్ సంఘం సునీల్ కుమార్,జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Authors

Was this helpful?

Thanks for your feedback!