
టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు (న్యూస్ వెలుగు ) కేవలం నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెస్ యూనిట్ అందుబాటు కి తీసుకొని వచ్చేందుకు అన్నిరకాల చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రొసిడింగ్ శాఖ మంత్రి దీజీ భరత్ వెల్లడించారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూరకొండ. రెనన్యూ గ్రామం కొతరాళ్ళు పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి మంత్రి నీటి భరత్ ఎంపీ జపాటి నాగరాజు, కలిసి భూమి నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎమ్మెలే శ్యాంబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారని గుర్తుచేశారు. స్పందించిన సీఎం అందుకు సంబంధించిన పనులు చేయాలని ఆదేశించారన్నారు. ఆ మేరకు ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం నిధులు పుష్కలంగా ఉన్నాయని, 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా
చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు… యూనిట్ పూర్తయితే. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని మంత్రి టిజి భరత్ తెలిపారు . ఈ ప్రాజెక్టు స్థాపనకు 11 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 32 మందికి ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుండన్నారు. టమాటో కిరప్, గ్రామాలో టొమాటో పికిల్ తదితర ఉత్పత్తులు తయారు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
టమోటా తోపాటు మామిడి, బనానా, షపాయ్, జామ పండ్లను ప్రాసెస్ చేసుకోవచ్చునన్నారు. జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో టొమాటో పంట సాగు చాలా ఎక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు.