
ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : బిజేపి
ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యేల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ వరుస ఆందోళనలను చేసినట్లు తెలిపింది. జాతీయ రాజధానిలో పరిపాలన దిగజారిందని ఆరోపించినట్లు బిజెపి తెలిపింది. దేశ రాజధానిలో రాజ్యాంగ విలువలు , ప్రజాస్వామ్య ప్రమాణాలు మరింత క్షీణించకుండా నిరోధించడానికి తక్షణమే రాష్ట్రపతి జోక్యం చాలా కీలకమని పేర్కొంది.
Was this helpful?
Thanks for your feedback!