తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిదులు

తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిదులు

ఆలూరు:కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్,జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామ నాయుడు,కర్నూల్ ఎంపీ పంచలింగాల నాగరాజు,అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం,ఆలూరు ఇంచార్జీ వీరభద్ర గౌడ పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలాశయం గేట్ల కొట్టుకుపోవడం వల్ల నీరు వృద్ధా అవ్వడమే కాకుండా కర్నూల్ ప్రాంతం వ్యవసాయానికి నీరు కరువు అవుతుందని మరియు రైతాంగం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.కావున వేగవంతంగా గేట్ మరమ్మతు పనులు చేపట్టాలని తుంగభద్ర బోర్డు అధికారులకు సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!