
తెలుగు భాషను పరిరక్షించుకుందాం: కలెక్టర్
పుట్టపర్తి న్యూస్ వెలుగు :మాతృ భాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో తెలుగు అధికార భాషా దినోత్సవ సందర్భంగా మరియు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా, గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి మరియు భారతదేశంలో భారత హాకీ జట్టుకు అత్యుత్తమ నాయకుడిగా పేరుపొందిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి ఘనంగా పూల మాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్చార్జి డిఆర్ఓ భాగ్య రేఖ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుభాష కమ్మదన్నాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వారు అన్నారు. తెలుగును ప్రేమిస్తే మన అమ్మను గౌరవించినట్లే అన్నారు. అప్పట్లో గ్రాంధిక భాషకు పట్టం కడుతున్న రోజుల్లో వ్యవహారిక భాషను కాపాడటానికి గిడుగు వెంకట రామమూర్తి పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారని . ఏవీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యవహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేయడం ఆరంభించారు. ఇందుకోసం ఆయన తెలుగు అనే పత్రికను ప్రారంభించారు. ఆ మహనీయులు ఆ కాలంలో కష్టపడి మంచి ఫలితాలు సాధించారని యువత ఆయన అడుగు జాడల్లో నడవలని పిలుపునిచ్చారు. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటున్నాం భారతదేశ ప్రభుత్వం ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని క్రీడా రంగంలో ఆయన చేసిన విశేష కృషిని ఈరోజు స్మరించుకుంటున్నామని తెలిపారు. మేజర్ ధ్యాన్ చంద్ పేరు భారత హాకీ చరిత్రలో అజరామరమైనదన్నారు. 1905 ఆగస్టు 29న అలహాబాద్ లో జన్మించిన ఆయన, భారత హాకీ జట్టు కు అత్యుత్తమ నాయకుడిగా నిలిచారు. ఆయన 1928, 1932, 1936 హాకీ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలను గెలుచుకోవడం లో కీలక పాత్ర పోషించారు. ధ్యానంద్ హాకీ మైదా నంలో చూపిన ప్రతిభ, జట్టు సమైక్య కృషి, విజయం కోసం వారి వ్యూహం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయి. థ్యాన్చంద్ గొప్పదనం కేవలం హాకీలోనే కాకుండా క్రీడా స్పూర్తి, క్రీడా క్రమశిక్షణ, మరియు దేశభక్తి విషయంలో కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన ఆడిన ఆటలలో అనేక అద్భుతమైన గోల్స్ చేశారు. జట్టులో వున్న క్రీడాకారులను ముందుకు నడిపిస్తూ, ఆయన క్రీడా నాయకత్వానికి కొత్త పునాది వేసారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1956లో పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది. త్వరలో క్రీడా రంగానికి సంబంధించిన పలు విషయాల పైన విద్యార్థులకు క్విజ్ పోటీలు, వ్యాస రచనలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రీడా సాధికార సంస్థ అధికారులు ఆదేశించారు. విద్యార్థులు ఈరోజు కలెక్టర్ కార్యాలయము ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం పీ ఈ టి పండితులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు, అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలను జిల్లా కలెక్టర్ తిలకించారు ఈ కార్యక్రమంలో క్రీడ సాధికార సంస్థ జిల్లా అధికారి ఉదయ్ కుమార్, టూరిజం అధికారి ప్రతాపరెడ్డి ఇతర సిబ్బంది, పీటి మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.