
త్వరలో విశాఖ నుంచి కార్డేలియా క్రూయిజ్ షిప్
విశాఖపట్నం; ఏపీలో పర్యాటకులకు సముద్ర ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా అందించేందుకు విశాఖపట్నంలో నిర్మించిన అధునాతన టెర్మినల్ నుంచి క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4 నుంచి 22వ తేదీ మధ్య పుదుచ్చేరి, చెన్నైకి మూడు సర్విసులు నడిపేందుకు కార్డలియా క్రూయిజ్ షిప్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన విశాఖ క్రూయిజ్ టెర్మినల్ను 2023 సెప్టెంబరు 4న అధికారికంగా ప్రారంభించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM