
దేవరగట్టు శ్రీమాళ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి
హోళగుంద,న్యూస్ వెలుగు; మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామిని ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి,తనయుడు వెంకటేష్ దర్శించుకున్నారు.ముఖ్యంగా పవిత్ర శ్రావణమాసం నాల్గవ ఆదివారం సందర్భంగా నియోజకవర్గం సమృద్ధిగా వర్షాలు కురిసి,పాడి పంటలు సుభిక్షంగా పండాలని దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీయుల్లా,కో కన్వీనర్ రవి,జడ్పీటిసి బావ శేషప్ప,నేరణికి సర్పంచ్ తనయుడు సోమప్ప,నేరణికి తండా సర్పంచ్ తనయుడు రామ్ నాయక్,యువ నాయకులు లోకనాథ్,గిరి,రమేష్,మరిమల్ల,మల్లికార్జున,సూరి, మంజు నాయక్ ఎంపిటిసిలు,సర్పంచులు,వైసిపి పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!