
దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్లో తీసుకువచ్చిన మార్పులను అధికారులు వివరించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!

