
నోటీసుల్లేవు..కూల్చివేతలే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..
Hyderabad News,velugu: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్గా వినిపిస్తోంది. ముఖ్యంగా.. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్ చేసింది హైడ్రా. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులను సంరక్షించడమే లక్ష్యంగా, ఆక్రమణలు తొలగించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. విధి నిర్వహణలో అంచనాలకు మించి దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో అక్రమార్కులు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హైడ్రా చర్యలపై, నిర్ణయాలపై ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. హైడ్రాపై వస్తున్న ఆరోపణలుకు క్లారిటీ ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!