
పర్యావరణాన్ని కాపాడుదాం; డివైఎఫ్ఐ
పొద్దుటూరు, న్యూస్ వెలుగు ;రాబోవు గణపతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ యుగంధర్ తెలిపారు. DYFI ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ ముద్రించిన మట్టి గణపతులను ప్రటిస్టిద్దాం – పర్యావరణాన్ని కపాడుదాం అనే పోస్టర్ ను ఆవిష్కరించారు.ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న DYFI యువజన సంఘానికి అభినందనలు తెలిపారు.ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం వలన అనేక ఉపద్రవాలు తలెత్తే ప్రమాదం భవిష్యత్ లో వుంది అన్నారు.ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల నీటిలోని జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని అలాగే భూమి కాలుష్యం అయితే పంటలకు ప్రమాదం వున్నదని అన్నారు.కావున ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అలాగే పర్యావరణాన్ని కపడుదమని మట్టి గణపతిని ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు. గణపతి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ప్రజలు తావివ్వకుండా సంతోషంగా కుల మత ప్రాంతాల అతీతంగా జరుపుకోవాలని అన్నారు.
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ మాట్లాడుతూ DYFI యువజన సంఘం పోరాటాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది అన్నారు.అందరం మట్టి గణపతిని ప్రతిష్టించి – పర్యావరణాన్ని కాపాడాల్సిన భాధ్యత మనందరి పైన వుంది అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం.డేవిడ్ రాజ్, ప్రొద్దుటూరు పట్టణ నాయకులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.