
పోసాని కేసు సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్
అమరావతి : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడు భార్గవ రెడ్డితో కలిసి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ని తిట్టానని నటుడు పోసాని కృష్ణమురళి చెప్పడంతో వారు కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఇరికిస్తున్నారని, బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM