
అమెరికాకు చేరుకున్న ప్రధాని
న్యూస్ వెలుగు ఇంటర్నెట్ డెస్క్ : భారత్ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. వాషింగ్టన్లో దిగిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం-USA సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఎదురుచూస్తున్నామని మోడీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం దేశాలు దగ్గరగా పనిచేస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ Xలో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM