ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి

ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో  సమావేశమయ్యాను. విద్యా వ్యవస్థలో తీసుకురాబోతున్న సంస్కరణలు ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి వారికి వివరించాను. పోటీ పడదాం..అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం అని వారితో అన్నాను. సమావేశంలో అసోసియేషన్ కోరిక మేరకు ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాను.  ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఫైర్ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్ మంజూరును సులభతరం చేయాలని సూచించారు. అన్ని సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు వివిధ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS