
మండలానికి 580 క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు… మండల వ్యవసాయ అధికారి రవి
మద్దికేర ,న్యూస్ వెలుగు న: మద్దికేర మండలానికి 580 క్వింటాళ్ల వేరుశనగను కేటాయించినట్లు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేరుశనగ విత్తనాలు కావలసిన రైతులు తమ పరిధిలోని గల స్థానిక రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ అధికారులను సంప్రదించి రసీదు పొందాలని ఆయన తెలియజేశారు.క్వింటం వేరుశనగ ధర 9300 కాగా,40 శాతం సబ్సిడీతో 3720 రూ పోగా రైతులు 5580 రూపాయలు చెల్లించాలని ఆయన తెలియజేశారు. రైతుకు గరిష్టంగా 90 కేజీల విత్తనాలను మాత్రమే అందజేస్తామని ఏవో రవి రైతులకు తెలియజేశారు.మరింత సమాచారం కొరకు తమ పరిధిలోని గల రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!