
మంత్రివర్గ సమావేశంలో కీలక సూచనలు చేసిన సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిధులు వంటి వాటిపై కీలక విషయాలను మంత్రిలతో చర్చించినట్లు సీఎం ఓ కార్యాలయం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అక్టోబర్ 4న ఆటో కార్మికులకు 15వేల రూపాయలను ఎకౌంట్లో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ గా సంక్షేమ పథకాలను ఆయన అభివర్ణించారు.

Was this helpful?
Thanks for your feedback!