బదిలీలపై కీలక సూచనలు చేసిన ప్రభుత్వం

బదిలీలపై కీలక సూచనలు చేసిన ప్రభుత్వం

జీఓ ఎంఎస్‌ నెంబరు 76 విడుదల

న్యూస్ వెలుగు:2025 మార్చి 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు శనివారం జీఓ ఎంఎస్‌ నెంబరు 76ని విడుదల చేయడంతో పాటు అన్ని డిపార్టుమెంట్స్‌ హెచ్‌ఓడిలకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల మంది ఉంటారని జీవో తెలిపింది .  ప్రభుత్వ నిర్ణయంతో ప్రధానమైన అన్ని శాఖల్లో ఉద్యోగులకు మేలు జరగడంతో పాటు వారి పెన్షన్ ఫైల్స్‌ రెడీ చేసుకునే వీలు కలుగుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. బదిలీల ప్రక్రియ ఈనెల 31తో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆందోళనలో ఉన్న పదవీ విరమణ చేయబోయో ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. సాధారణ బదిలీల నుంచి రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు నివ్వడం పట్ల ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!