మా సమస్యలను పరిష్కరించండి …!

మా సమస్యలను పరిష్కరించండి …!

తుగ్గలి న్యూస్ వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి,వెల్ఫేర్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పులిశేఖర్ శనివారం రోజున పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శామ్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ తో పాటుగా బేసిక్ పే ను ఇవ్వాలని ఆయన తెలియజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యేకు తెలియజేశారు.దీనిపై పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యాంబాబు సానుకూలంగా స్పందించి వెల్ఫేర్ అసిస్టెంట్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసినట్లు కర్నూలు జిల్లా వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి శేఖర్ తెలియజేశారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!