మోడీ పర్యటన ఏర్పాట్లు చేయండి :సీఎం చంద్రబాబు

మోడీ పర్యటన ఏర్పాట్లు చేయండి :సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 19న పుట్టపర్తికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రముఖుల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS