
రచ్చ బండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
నంద్యాల న్యూస్ వెలుగు : డోన్ పట్టణంలోని 32 వ వార్డు లో రచ్చ బండ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. 32 వ వార్డు లో రహదారి, విద్యుత్, మరియు కాలువల సమస్యలను తీర్చారని స్థానికులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్థానికుల నుంచి వినతి పత్రాలు అందుకుని వారి సమస్యలను త్వరితగతిన తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేరుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని చట్టబద్ధత ఇచ్చినందుకు కేంద్రానికి శుభాకాంక్షలు స్థానిక ప్రజలతో దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!

