
రాష్ట్రపతి కి ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పుట్టపర్తి న్యూస్ వెలుగు : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో పాల్గొనేందుకు శనివారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోపాటు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, 13వ నెహ్రూ యువ కేంద్రం జాతీయ వైస్ చైర్మన్, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సీసీఎల్ఏ & స్పెషల్ సిఎస్ జయలక్ష్మి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, డిఐజి షిమోషీ, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

