రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ పై కేంద్ర  ప్రభుత్వం కక్ష సాధింపు

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు

న్యూస్ వెలుగు పత్తికొండ  :

 స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డిటీ) సంస్థపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. విదేశీ సహాయ చట్టం (ఎఫ్సిఆర్ఎ) రిన్యూవల్‌ను నిరోధించి, సంస్థ సేవా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, పండ్ల తోటల అభివృద్ధి, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యా, వైద్య సేవలందిస్తూ, వేలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తూ ఆర్డిటీ సంస్థ గత ఆరు దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. కులమతానికి అతీతంగా, లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ఈ సంస్థను రాజకీయ కక్షతో దెబ్బతీయడం నిందనీయమైన చర్య.

బీజేపీ మత రాజకీయాల వల్ల ఇప్పటివరకు అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమ మళ్లీ వెనుకబడి పోతుందనే ఆందోళన కలుగుతుంది. ఇప్పటికే రాయలసీమ డిక్లరేషన్ అని ఎన్నికలకు వచ్చిన వారు ఇప్పుడు దాన్ని పక్కన పడేసే పరిస్తితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు RDT సంస్థకు మద్దతుగా చొరవ చూపాలి. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి FCRA రిన్యూవల్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా స్పందించి బీజేపీ జెండాలను తొలగించే స్థాయికి వెళ్లే పరిస్థితి తలెత్తుతుంది.

ఈ అంశాల పైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. సేవా కార్యక్రమాలపై కక్ష సాధించకుండా, ప్రజల సంక్షేమానికి మద్దతుగా పని చేయడం రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరి బాధ్యత. రాయలసీమ అభివృద్ధి కోసం, పేదల భవిష్యత్తు కోసం, RDT వంటి నిస్వార్థ సేవా సంస్థలను బలపరచాల్సిన అవసరం ఉంది అని. బీజేపీ, కూటమి నాయకులకు మా స్పష్టమైన హెచ్చరిక, RDT సేవలకు ఆటంకం కలిగించొద్దు అని, ప్రజల ఆగ్రహానికి గురి కావొద్దు అని తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!