
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్
గుంటూరు న్యూస్ వెలుగు : భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం లోని నులకపేట క్వారీ ప్రాంతాన్ని మంత్రి పర్యటించి పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై స్థానికులను అడిగి మంత్రి లోకేశ్ తెలుసుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!