
వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి అనిత
అమరావతి : భారీ వర్షాలు, జిల్లాల్లో పరిస్థితులపై విపత్తుల నిర్వాహణ శాఖ కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి మునిగిన ప్రాంతాల్లో అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి , వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని సూచించారు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పనులుంటే తప్ప,ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!